allu arjun: భారీ మొత్తం పలికిన 'నా పేరు సూర్య' శాటిలైట్ హక్కులు

  • వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య'
  • 15 కోట్లకి శాటిలైట్ హక్కులు 
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చిత్రం తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇటీవల వదిలిన ఈ సినిమా ఫస్టు ఇంపాక్ట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకు పలికినట్టుగా సమాచారం.

 ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగువారు సొంతం చేసుకున్నారట. ఇందుకోసం వాళ్లు 15 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం. గతంలో అల్లు అర్జున్ చేసిన 'దువ్వాడ జగన్నాథం' సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ తెలుగువారే 13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు 'నా పేరు సూర్య'కు అంతకన్నా ఎక్కువ రేటు పెట్టడం విశేషం.      

More Telugu News