Balakrishna: 'జై సింహా' సినిమా నిర్మాత కార్యాల‌యంలో ఐటీ శాఖ సోదాలు

  • బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'జై సింహా'
  • ఇటీవలే విడుదల
  • ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
  • హైదరాబాద్‌ కృష్ణాన‌గ‌ర్‌లోని సి.కల్యాణ్ ఆఫీసులో కొనసాగుతోన్న తనిఖీలు

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ‘జై సింహా’కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సినిమాకు థియేటర్లను కూడా భారీగా పెంచారు. కాగా, ఈ సినిమా నిర్మాత కార్యాల‌యంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. కృష్ణాన‌గ‌ర్‌లోని సి.కల్యాణ్ కార్యాలయానికి వచ్చిన ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

More Telugu News