charan: 'రంగస్థలం'కి పోటీగా రంగంలోకి 'ఎమ్మెల్యే'

  • మార్చి 28న 'ఎమ్మెల్యే' రిలీజ్ 
  • మార్చి 29న ప్రేక్షకుల ముందుకు 'మహానటి'
  • మార్చి 30వ తేదీన 'రంగస్థలం' విడుదల

చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'రంగస్థలం' సినిమాను, మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాకి ఒక రోజు ముందుగా 'మహానటి' సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. 'రంగస్థలం' కంటెంట్ వేరు .. 'మహానటి' కాన్సెప్ట్ వేరు. అందువలన ఈ సినిమాల మధ్య పోటీ పెద్దగా ఉండదని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీగా మరో సినిమా రంగంలోకి దిగుతోంది .. అదే కల్యాణ్ రామ్ ' ఎమ్మెల్యే'.  ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ అలరించనుంది. ఈ సినిమాను మార్చి 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. వరుసగా మూడు రోజుల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయన్న మాట. ఇక ఎవరు లాభాలను మూటగడతారనేది చూడాలి.      

More Telugu News