barc: ప్రారంభానికి ముందే రికార్డు సృష్టించిన ఐపీఎల్‌... ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ ఈవెంట్‌కి రికార్డు స్థాయిలో వీక్ష‌ణ‌లు

  • వివ‌రాల‌ను వెల్ల‌డించిన బార్క్‌
  • హాట్‌స్టార్ ద్వారా తిల‌కించిన 4 మిలియ‌న్ల మంది
  • అదేరోజు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన ఐపీఎల్ 2018

వీక్ష‌కుల విష‌యంలో ప్రారంభానికి ముందే ఐపీఎల్ సీజ‌న్ రికార్డుల‌ను సృష్టిస్తోంది. జ‌న‌వ‌రి 4న ముంబైలో జ‌రిగిన ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ ఈవెంట్‌ను 8.1 మిలియ‌న్ల మంది వీక్షించిన‌ట్లు తెలుస్తోంది. ప్లేయ‌ర్లు అదే జ‌ట్టులో కొన‌సాగుతారా? లేక వేలానికి వెళ‌తారా? అనే ఉత్కంఠ‌ను సృష్టించ‌డం వ‌ల్ల ఇంత మొత్తంలో వీక్ష‌ణ‌లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

తొలిసారి ఈ ఈవెంట్‌ను స్టార్ ఇండియా టెలివిజ‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన స్టార్ స్పోర్ట్స్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. ఈ వేడుక‌ను టెలివిజన్ల ద్వారా 4.1మిలియన్ల మంది, డిజిటల్‌ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్‌ ద్వారా 4 మిలియన్ల మంది తిలకించారని బార్క్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఆ రోజు ఐపీఎల్‌-2018 ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో ఆటగాళ్ల వేలం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News