arjuna awardee: సినీరంగ ప్ర‌వేశం చేయ‌బోతున్న అర్జున అవార్డు గ్ర‌హీత దీపికా కుమారి

  • మంత్రాలు చేస్తున్నార‌నే నెపంతో జరిగే హ‌త్య‌లు క‌థాంశంగా చిత్రం
  • జార్ఖండ్‌లో జ‌ర‌గ‌నున్న షూటింగ్‌
  • చిత్రం పేరు - బిసాహి

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో బంగారు ప‌త‌కం సంపాదించిన విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి త్వ‌ర‌లో సినీరంగ ప్ర‌వేశం చేయ‌బోతోంది. మంత్రాలు చేస్తున్నార‌నే నెపంతో జ‌రిగే హ‌త్య‌ల క‌థాంశంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇందులో దీపిక ప్ర‌ధాన పాత్ర పోషించ‌బోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'బిసాహి' అనే పేరును నిర్ణ‌యించారు.

దీపిక స్వ‌రాష్ట్రం జార్ఖండ్‌లో ఇప్ప‌టికీ సామాజిక నేరంగా ఉన్న ఈ హ‌త్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. జార్ఖండ్‌లోని ప‌లు మారుమూల గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మొద‌ట్లో ఈ చిత్రంలో న‌టించ‌డానికి దీపిక సుముఖత వ్యక్తపరచలేదట‌.. కానీ స్క్రిప్ట్ చ‌దివిన త‌ర్వాత న‌టించడానికి ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News