nagashourya: అందమైన ప్రేమకథగా 'ఛలో' .. ట్రైలర్ రిలీజ్ రేపే

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'ఛలో'
  • కథానాయికగా రష్మిక మందన 
  • ఫిబ్రవరి 2న భారీ రిలీజ్   

తెలుగు తెరపై లవర్ బాయ్స్ గా రాణిస్తోన్న హీరోల్లో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు. తొలిసారిగా ఆయన తన సొంత బ్యానర్లో 'ఛలో' సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి, వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.

రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, తాజాగా ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ హ్యాపీగా వుంది. ట్రైలర్ తో మరింతగా అంచనాలను పెంచగలం అనే నమ్మకంతో వున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సొంత బ్యానర్లో నాగశౌర్య హిట్ కొడతాడేమో చూడాలి మరి.   

More Telugu News