padmavat: 'ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన నిర్మాత‌లు

  • విచార‌ణ‌కు అంగీకరించిన సీజేఐ
  • రేపు జ‌రగ‌నున్న విచార‌ణ‌
  • సినిమా విడుద‌ల‌ను నిషేధించిన నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు

రాష్ట్రంలో కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నిర‌స‌న‌ల దృష్ట్యా 'ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల‌పై నిషేధం విధించడాన్ని స‌వాలు చేస్తూ చిత్ర నిర్మాత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. నిర్మాత‌ల పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు భారత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ పిటిష‌న్‌పై రేపు విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాలతో పాటు హ‌ర్యానా రాష్ట్రం కూడా ఈ సినిమా విడుద‌ల‌పై నిషేధం విధించ‌డంతో వేరే దిక్కులేక నిర్మాత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 25న ఈ సినిమా విడుద‌ల‌కు సీబీఎఫ్‌సీ మార్గం సుగ‌మం చేసినప్ప‌టికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంపై నిర్మాత‌లు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News