india: నేడు భార‌త మార్కెట్‌లోకి శాంసంగ్ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌

  • 12 గం.ల‌కి గురుగ్రామ్‌లో విడుద‌ల‌
  • అమెజాన్‌లో ఎక్స్ క్లూజివ్ సేల్‌
  • ధ‌ర రూ. 13000ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం

శాంసంగ్ వారి లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్ ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు భార‌త మార్కెట్లో విడుద‌ల‌కానుంది. గురుగ్రామ్‌లో ఈ ఫోన్‌ను ఆవిష్క‌రించ‌నున్నారు. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ క్లూజివ్ సేల్ జ‌ర‌గ‌నుంది. దీని అధికారిక ధ‌రను ఇంకా కంపెనీ ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ రూ. 13000ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికి వ‌స్తే... 5.5 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే, 64 బిట్ శాంసంగ్ ఎక్సినోస్ 7870 ప్రాసెస‌ర్‌, 13 ఎంపీ ప్రాథ‌మిక కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ స్నాప‌ర్‌, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌నున్నాయి. 4 జీబీ ర్యామ్‌, 3 జీబీ వేరియంట్ల‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. వీటిలో 64 జీబీ, 32 జీబీ స్టోరేజీ వుంటుంది. ఇందులో ప్ర‌త్యేకంగా శాంసంగ్ మాల్‌, శాంసంగ్ పే యాప్‌లు వున్నాయి.

More Telugu News