jio: జియో ప్రైమ్ మెంబ‌ర్ల‌కు రీఛార్జీపై 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌!

  • రూ. 700 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొందే అవ‌కాశం
  • జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఆఫ‌ర్‌
  • రెండు విధాలుగా ఆఫ‌ర్ అందుకునే అవ‌కాశం

జియో ప్రైమ్ మెంబ‌ర్ల కోసం ఓ ప్ర‌త్యేక రీఛార్జీ ఆఫ‌ర్‌ను జియో ప్ర‌వేశ‌పెట్టింది. దీని ప్ర‌కారం 398 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై మొత్తం 700 రూపాయల వరకు అంటే 100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం '100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌' జనవరి 31 వరకు అందుబాటులో వుంటుంది. జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌, డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ ల‌భించ‌నుంది.

398 రూపాయలు, లేదా ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై 400 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను, ఎనిమిది రూ. 50 వోచర్ల రూపంలో అందిస్తోంది. ఈ వోచర్లను తర్వాత చేసుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రిడీమ్‌ చేసుకోవచ్చు. ఇక డిజిట‌ల్ వాలెట్ల విష‌యానికి వ‌స్తే... ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే, భీమ్‌, యాక్సిస్‌పే ద్వారా పేమెంట్‌ చేసిన జియో ప్రైమ్‌ మెంబర్లకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందించ‌నుంది.

More Telugu News