Karnataka: వృద్ధుడిని చొక్కా ప‌ట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసు.. సీసీ కెమెరాలో రికార్డు

  • క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరులో ఘటన
  • శృంగేరీ ఆల‌యంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించిన వృద్ధుడు
  • భక్తులంతా చూస్తుండగానే దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసు

క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరులో ఓ పోలీసు కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగాడు. శృంగేరీ శారదాంబ ఆల‌యంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించిన వృద్ధుడి చొక్కాను ప‌ట్టుకుని ప్ర‌వేశ ద్వారానికి దూరంగా ఈడ్చుకెళ్లాడు. భ‌క్తులందరూ చూస్తుండగానే పోలీసు దాష్టీకానికి పాల్పడిన ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవేగౌడ కుటుంబ స‌భ్యులు ఆల‌యంలో ఉన్న కార‌ణంగా ఆ వృద్ధుడిని గుడిలోకి రావ‌ద్ద‌ని పోలీసులు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం వృద్ధుడిపై దౌర్జ‌న్యానికి దిగిన స‌ద‌రు కానిస్టేబుల్‌ని అధికారులు స‌స్పెండ్ చేశారు.     

More Telugu News