India: దక్షిణాఫ్రికాలో సింహాలతో ఫొటోలు దిగిన భారత క్రికెటర్ల భార్యలు

  • దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా
  • పర్యాటక ప్రదేశాలు తిరుగుతూ క్రికెటర్ల భార్యలు ఎంజాయ్
  • సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు

టీమిండియా దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. వారు ప్ర‌స్తుతం సెంచూరియ‌న్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. మరోపక్క, వారి భార్య‌లు ప‌ర్యాట‌క ప్రాంతాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, ర‌హానె, ఉమేశ్‌ యాదవ్‌, శిఖర్‌ ధావన్‌ భార్యలు లయన్‌ పార్కుకి వెళ్లి, సింహాలతో  ఫొటోలు దిగారు. అనంత‌రం వాటిని త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. త‌మ పిల్ల‌ల‌ను కూడా క్రికెట‌ర్ల భార్య‌లు సింహాల వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మీరూ చూడండి...     

More Telugu News