p vasu: ద‌ర్శ‌కుడు పి. వాసు చ‌నిపోయాడంటూ వార్తలు... ఖండించిన ద‌ర్శ‌కుడు

  • వీడియో మెసేజ్ ద్వారా స్ప‌ష్ట‌త‌
  • వాట్సాప్‌లో చ‌క్క‌ర్లు కొట్టిన మ‌ర‌ణ‌వార్త‌
  • ఆందోళ‌న ప‌డిన అభిమానులు

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో చిత్రాలు తీసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పి. వాసు చ‌నిపోయాడంటూ కొన్ని మెసేజ్‌లు వాట్సాప్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిని చూసి అభిమానులు ఆందోళ‌న చెంద‌డంతో, ఈ వార్త‌లను ఖండిస్తూ ఆయ‌నే స్వ‌యంగా ఓ వీడియో మెసేజ్‌ను విడుద‌ల చేశారు.

తాను చాలా ఆరోగ్యంగా ఉన్నాన‌ని, వాట్సాప్ మెసేజ్ చూడ‌గానే త‌న‌కు న‌వ్వొచ్చింద‌ని, అభిమానులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మూడు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు వాసు వీడియోలో తెలిపారు. గ‌తంలో కూడా చాలా మంది ద‌ర్శ‌కులు, న‌టులు మ‌ర‌ణించినట్లు త‌ప్పుడు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News