kabul: కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంపై రాకెట్ దాడి!

  • ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో దాడి
  • దెబ్బతిన్న కార్యాలయ గోడలు
  • ఉద్యోగులు క్షేమం

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉన్న ఇండియన్ ఎంబసీని రాకెట్ ఢీకొనడం కలకలం రేపింది. ఈ దాడిలో రాయబార కార్యాలయం పై గోడలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఉద్యోగులంతా క్షేమంగానే బయటపడినప్పటికీ... వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక ఇతర కారణాల వల్ల జరిగిందా? అనేది చెప్పలేమని విదేశాంగ అధికారులు తెలిపారు. భవనాన్ని రాకెట్ ఢీకొన్న ఫొటోను భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

More Telugu News