airport: ట్రిపోలి మిశ్రాటా విమానాశ్ర‌యంలో కాల్పుల క‌ల‌క‌లం.. ప్రాణాలు కోల్పోయిన 9 మంది

  • ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
  • విమానాలను ఎయిర్‌పోర్టు నుంచి దారి మళ్లించిన‌ అధికారులు

లిబియాలోని ట్రిపోలి మిశ్రాటా విమానాశ్ర‌యంలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇరు వ‌ర్గాల వ్య‌క్తులు ఒక‌రిపై ఒక‌రు కాల్పులు జ‌రుపుతూ విరుచుకుప‌డ్డార‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసి, విమానాలను ఎయిర్‌పోర్టు నుంచి దారి మళ్లించిన‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించామ‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News