bhimavaram: పందెం కోడి.. అక్కడికక్కడే చికెన్ పకోడి!

  • చికెన్ పకోడీగా మారిపోతున్న ఓడిపోయిన కోళ్లు
  • పందెపురాయుళ్ల జిహ్వచాపల్యాన్ని తీరుస్తున్న నాన్ వెజ్
  • భారీ ఎత్తున పందేలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీలో కోడి పందేలు భారీ ఎత్తున సాగుతున్నాయి. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరసర ప్రాంతాల్లో అయితే హడావుడి మరింత ఎక్కువ. ఓ పక్కన పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే... మరోవైపు పందెంరాయుళ్లు నాన్ వెజ్ వంటకాలను లాగించేస్తున్నారు.

పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. దీంతో, పందెం కోళ్లను రుచి చూడటానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్.. ఇలా వెరైటీ నాన్ వెజ్ వంటకాలను ఎంజాయ్ చేస్తూ పందెపురాయుళ్లు హుషారుగా పందేలు కాస్తున్నారు. ఈ క్రమంలో, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

More Telugu News