Pakistan: భారత ఆర్మీ మరో సాహసం... సర్జికల్ దాడులు చేసి ఏడుగురు పాకిస్థాన్ రేంజర్లను మట్టుబెట్టిన వైనం

  • పూంచ్ సెక్టార్ ప‌రిధిలోని వాస్త‌వాధీన రేఖ ఆవ‌ల సైన్యం ల‌క్షిత దాడులు
  • చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన మ‌రో ఆరుగురు జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాదులు హ‌తం
  • ఉగ్ర‌వాదుల‌ను నియంత్ర‌ణ రేఖ వ‌ద్దే మ‌ట్టుబెట్టిన భారత ఆర్మీ

భార‌త సైన్యం మ‌రోసారి సాహ‌సం చేసింది. భార‌త్‌, పాక్‌ స‌రిహ‌ద్దుల్లో ప‌దే ప‌దే కాల్పుల‌కు తెగ‌బ‌డుతూ, ఉగ్ర‌వాదులు చొర‌బ‌డేలా ప్రోత్సహిస్తోన్న పాక్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. పూంచ్ సెక్టార్ ప‌రిధిలోని వాస్త‌వాధీన రేఖ ఆవ‌ల భార‌త‌ సైన్యం ల‌క్షిత దాడులు జ‌రిపింది. ఈ దాడుల్లో ఏడుగురు పాక్ రేంజ‌ర్లను భార‌త సైన్యం హ‌తమార్చింది. అలాగే, చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన మ‌రో ఆరుగురు జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాదులు కూడా హ‌తమ‌య్యారు. ఉగ్ర‌వాదుల‌ను నియంత్ర‌ణ రేఖ వ‌ద్దే మ‌ట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ల‌క్షిత దాడుల‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.     

More Telugu News