Karnataka: సంచలనం... ఎన్నికల ఖర్చు కోసం కిడ్నాప్ చేసిన కర్ణాటక మహిళా నేత!

  • కిడ్నాప్ ప్లాన్ చేసిన జేడీఎస్ మహిళా అధ్యక్షురాలు అర్షియా
  • మాజీ కార్పొరేషన్ సభ్యుడు మల్లికార్జునప్ప కిడ్నాప్
  • కోటి రూపాయలు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరింపు
  • పట్టించిన డ్రైవర్ కాల్ లిస్టు
  • పోలీసుల అదుపులో నలుగురు

ప్రజలకు సేవ చేస్తానని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చే వారు అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ వారే దారితప్పితే... అటువంటి ఘటనకు నిదర్శనమే ఈ వార్త.  కర్ణాటకలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉదయపు వాహ్యాళికి వెళ్లిన యలహంక మాజీ నగర సభ్యుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్ప కిడ్నాప్ కు గురికాగా, రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఉదంతం వెనుకన్న సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.

 ఆయన్ను కిడ్నాప్ చేసిన ముఠా వెనకున్న నలుగురిని అరెస్ట్ చేయగా, అందులో జేడీఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అర్షియా అలీ కూడా ఉండటం కేసును పతాక శీర్షికల్లో చేర్చింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించిన ఆమె, ఎన్నికల ఖర్చు కోసం ఈ మాస్టర్ ప్లాన్ వేసింది.

కాంతరాజ్‌ గౌడ, ప్రసాద్‌, డ్రైవర్‌ ప్రదీప్‌ లను టీమ్ గా చేర్చుకున్న ఆమె, మారణాయుధాలతో వచ్చి మల్లికార్జునప్పను బెదిరించి బలవంతంగా తీసుకెళ్లారు. ఆపై అతని కుమారుడు, డాక్టరుగా పని చేస్తున్న రవికుమార్ కు ఫోన్ చేసి రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆయన, డబ్బు ఇస్తానని హామీ ఇచ్చి, తండ్రికి హాని తలపెట్టవద్దని వేడుకున్నాడు. ఆపై రూ. 60 లక్షలు సమకూర్చుకుని, స్నేహితుల సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో యహలంక డీసీపీ గిరీశ్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఆయన కిడ్నాపైన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించింది. మొబైల్ నంబర్ ఆధారంగా హొరమావి ప్రాంతంలో ఉన్న కారు డ్రైవర్ ప్రదీప్ తొలుత పట్టుబడగా, అతనిచ్చిన సమాచారంతో మిగతా వారినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయలకు పైగా నగదు, బంగారు నగలు, ఫిస్టల్, తూటాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News