Lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • లావణ్య త్రిపాఠి కోరిక తీరిందట!
  • సెట్స్ కి రెడీ అవుతున్న మణిరత్నం 
  • కేరళకు మారిన 'సైరా' షెడ్యూలు 
  • 'వైఫ్ ఆఫ్ రామ్'గా మంచు లక్ష్మి  

*  తాను కోరుకునే ఇల్లు తనకు దొరికిందని ముచ్చటపడుతోంది అందాలతార లావణ్య త్రిపాఠి. ఇన్నాళ్లు షూటింగ్ కోసం వచ్చి, హోటల్స్ లో వున్న ఈ భామ హైదరాబాదు జూబ్లీ హిల్స్ లో ఓ బంగాళా కోసం తెగ వెతికిందట. చివరికి ఇటీవలే తాను కోరుకునే రీతిలో వుండే ఇల్లు దొరికిందని చెప్పింది. 'డెహ్రాడూన్ లో మాది పెద్ద బంగాళా. చుట్టూ పచ్చికతో చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అలాంటి ఇంటికోసం వెతికాను. చివరికి జూబ్లీ హిల్స్ లో దొరికింది. అయితే, అద్దెకే లెండి' అంటూ చెప్పింది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ, తెలుగు భాషల్లో రూపొందించే తాజా చిత్రం షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. విశేషం ఏమిటంటే, ఇందులో అరవింద్ స్వామి, శింబు, ఫహాద్ ఫాజిల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారట. విజయ్ సేతుపతి పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. జయసుధ, ప్రకాష్ రాజ్ ఓ జంటగా నటిస్తారు.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కేరళలో జరుగుతుంది. మొదట్లో ఈ షెడ్యూలును పొల్లాచ్చిలో చేయాలనుకున్నారు. అయితే, ఇప్పుడు కేరళకు మార్చినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
*  మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'వైఫ్ ఆఫ్ రామ్' అనే చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు విజయ్ యలకంటి దర్శకత్వం వహించే ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు.             

More Telugu News