Cricket: సెంచూరియన్ టెస్టు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 335 పరుగులు

  • ముగిసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్  
  • 113.5 ఓవర్లకు 335 పరుగులకు దక్షిణాఫ్రికా జట్టు ఆలౌట్
  • విజృంభించిన ఇషాంత్ శర్మ

దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు 269/6తో సఫారీ జట్టు రెండో రోజు ఆట ప్రారంభించింది. ఇషాంత్ శర్మ విజృంభించడంతో 335 పరుగులకు (113.5 ఓవర్లు) దక్షిణాఫ్రికా జట్టు ఆలౌటైంది.

కాగా, తొలిరోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఓ దశలో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో, భారీ స్కోరు సాధించే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసింది. రెండో రోజు ఆట (ఈరోజు)లో సఫారీ జట్టును త్వరగానే టీమిండియా కుప్పకూల్చడం గమనార్హం.

బ్యాటింగ్:  మర్ క్రమ్ 94, ఆమ్లా 82, డుప్లెసిస్ 63, ఎల్గార్ 31, డివిలియర్స్ 20

భారత్ బౌలింగ్: అశ్విన్ - 4, ఇషాంత్ - 3, షమి -1

More Telugu News