guntur: గుంటూరు జిల్లాలో మహిళా సర్పంచ్ ఆత్మహత్య!

  • నారాకోడూరు గ్రామ సర్పంచ్ లక్ష్మీదుర్గ ఆత్మహత్య
  • ఇంట్లో ఉరివేసుకున్న వైనం
  • కన్నీటిపర్యంతమవుతున్న కుటుంబసభ్యులు, బంధువులు

గుంటూరు జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ సర్పంచ్ లక్ష్మీదుర్గ తమ ఇంట్లో ఉరివేసుకున్నారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, కన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలివిడిగా ఉండే లక్ష్మీదుర్గ ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News