India: 200 దాటిన దక్షిణాఫ్రికా స్కోరు.. ఓపెనర్ మార్క్‌రమ్ సెంచరీ మిస్.. ఆమ్లా అర్ధ సెంచరీ

  • సెంచూరియన్‌లో భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
  • మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
  • ప్రస్తుతం స్కోరు 64 ఓవర్లకి మూడు వికెట్ల నష్టానికి 203

దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో బ్యాటింగ్‌ చేస్తోన్న సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన విషయం తెలిసిందే. మరో ఓపెనర్ మార్క్‌రమ్ ధాటిగా ఆడి 94 పరుగులు చేశాడు. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చుకుని మార్క్‌రమ్ వెనుదిరిగాడు.

అనంతరం డివిల్లియర్స్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హషిమ్ ఆమ్లా 52, డుప్లెసిస్ 0 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు 64 ఓవర్లకి మూడు వికెట్ల నష్టానికి 203గా ఉంది. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

More Telugu News