gayatri: "పురాణాల్లో వాళ్లు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే"...అంటూ 'గాయత్రి ' టీజర్ విడుదల !

  • మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి'
  • ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు
  • ఫిబ్రవరి 9వ తేదీన విడుదల

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి ' సినిమా టీజర్ ని విడుదల చేశారు. "రామాయణంలో రామునికి, రావణాసురునికి గొడవ, మహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ.. వాళ్లు వాళ్లు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది.. కానీ వాళ్ల మూలంగా జరిగిన యుద్ధంలో అటు, ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్లు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే"... అంటూ మోహన్ బాబు చెప్పే పవర్ఫుల్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

 ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. మంచు విష్ణు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, శ్రియ .. నిఖిలా విమల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

More Telugu News