Ind V SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

  • సెంచూరియ‌న్‌లో భారత్, సౌతాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్
  • మొద‌టి టెస్టులో గెలిచిన ద‌క్షిణాఫ్రికా
  • ఇందులోనూ గెలిచి సిరీస్‌ కైవ‌సం చేసుకోవాలని పట్టుదల

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ఈ రోజు నుంచి రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జ‌ట్టుతో త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. మొద‌టి టెస్టులో గెలిచిన ద‌క్షిణాఫ్రికా ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. భార‌త జ‌ట్టులో లోకేశ్ రాహుల్‌, ముర‌ళీ విజ‌య్, చ‌టేశ్వ‌ర పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, పార్థివ్ ప‌టేల్‌, హార్దిక్ పాండ్యా, అశ్విన్, ష‌మీ, బుమ్రా, ఇషాంత్ శ‌ర్మ ఉన్నారు. ఈ మ్యాచ్ సెంచూరియ‌న్‌లో కొన‌సాగుతోంది.

More Telugu News