Karimnagar: ఎంపీటీసి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బిగ్ షాక్... గెలిచిన కాంగ్రెస్, బీజేపీ!

  • కరీంనగర్ జిల్లాలో రెండు ఉప ఎన్నికలు
  • రెండు చోట్లా ఓడిపోయిన టీఆర్ఎస్
  • మూడింట ఒక వంతు ఓట్లు కూడా రాని స్థితి

కరీంనగర్ జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గంగాధర ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, అసాన్ పల్లి సీటును భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, మూడింట ఒక వంతు ఓట్లు కూడా టీఆర్ఎస్ కు రాకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, తాము అసాన్ పల్లిలో నిలిపిన మనోహర్ గెలవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్న విషయం ఈ ఎన్నికలతో రుజువైందని అన్నారు. ఆ పార్టీ అధినేతలు ఓటమిని సమీక్షించుకోవాలని సలహా ఇచ్చారు

More Telugu News