Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మరో చిత్రానికి సంతకం చేసిన రకుల్ 
  • 'అజ్ఞాతవాసి'కి 15 నిమిషాల నిడివి తగ్గింపు 
  • 'క్వీన్' నుంచి తప్పుకున్న నీలకంఠ
  • కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన నాగ్

*  ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ తెలుగు చిత్రానికి సంతకం చేసింది. నాగార్జున, నాని హీరోలుగా రూపొందే మల్టీ స్టారర్ లో ఈ చిన్నది ఓ హీరోయిన్ గా ఎంపికైంది. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్న నేపథ్యంలో చిత్రాన్ని ఎడిట్ చేయాలని భావిస్తున్నారట. అనవసరం అనిపించే 15 నిమిషాల సన్నివేశాలతో కూడిన నిడివిని తగ్గిస్తున్నట్టు సమాచారం. అలాగే, పవన్, వెంకీ కాంబినేషన్ సీన్స్ ను త్వరలో జోడిస్తారట.
*  'క్వీన్' చిత్రం తెలుగు రీమేక్ నుంచి దర్శకుడు నీలకంఠ తప్పుకున్నట్టు తెలుస్తోంది. చిత్ర కథానాయిక తమన్నాకు, దర్శకుడికి అభిప్రాయభేదాలు రావడంతో తెలుగు వెర్షన్ నుంచి ఆయన తప్పుకున్నాడట. అయితే, ఇదే చిత్రం మలయాళ వెర్షన్ కి మాత్రం ఆయన కొనసాగుతున్నట్టు చెబుతున్నారు.
*  మొదటి నుంచీ కూడా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ వస్తున్న అక్కినేని నాగార్జున తాజాగా వంశీ అనే కొత్త కుర్రాడికి దర్శకుడిగా చాన్స్ ఇస్తున్నారు. వంశీ చెప్పిన కథ బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే ఓకే చెప్పేశారట.     

More Telugu News