Balakrishna: బాలయ్య అభిమానుల ఆగ్రహానికి గురైన కత్తి మహేశ్!

  • ‘జై సింహా’ బాగాలేదంటూ కత్తి మహేశ్ రివ్యూ
  • సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వ్యాఖ్య
  • ఆ మాట థియేటర్ల వద్దకు వచ్చి చెప్పాలంటూ బాలయ్య అభిమానుల సవాల్

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ను ఈసారి బాలకృష్ణ అభిమానులు టార్గెట్ చేశారు. శుక్రవారం విడుదలైన బాలయ్య సినిమా ‘జై సింహా’ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిందంటూ రేటింగ్ ఇచ్చిన కత్తిపై బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. కత్తికి ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా ‘జై సింహా’ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు వచ్చి రివ్యూ ఇవ్వాలని సవాల్ విసిరారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. బ్రహ్మానందం చేసిన చీప్ కామెడీ సన్నివేశాలు తప్ప సినిమా  ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ అంటే ఇంటరెస్ట్ చూపని వాళ్ళు కూడా కధ, కధనం పరంగా బాగుందని మెచ్చుకుంటున్నారు. దీంతో ఖుషీగా ఉన్న అభిమానులకు కత్తి రేటింగ్ ఆగ్రహం తెప్పించింది.

80ల కథకి, 90ల కథనంతో సినిమాను కలగాపులగం చేశారని, ‘జై సింహా’ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కత్తి మహేశ్ రేటింగ్ ఇచ్చాడు. కథ, కథనాలు ఏమంత బాగోలేవని, బాలకృష్ణ అసంబద్ధమైన పాత్రలో నటించారని అన్నాడు. అక్కడితో ఆగక సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ ఓ సెటైర్ కూడా వేశాడు. ఇది బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కత్తి ఇంట్లో కూర్చుని రివ్యూలు ఇవ్వడం కాదని, దమ్ముంటే థియేటర్ల వద్దకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు.  సినిమాను తీసింది ప్రేక్షకుల కోసం కానీ కత్తి కోసం కాదని ఎద్దేవా చేశారు.

More Telugu News