Pakistan: తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని లైవ్‌లో వార్తలు చదివిన వైనం.. మీరూ చూడండి!

  • న్యూస్ రీడర్‌గా రాలేదు.. ఓ బిడ్డకు తల్లిగా వచ్చానని యువతి వ్యాఖ్య
  • ఓ బాలికపై దుండగులు అత్యాచారం చేసి, చంపిన తీరును వివరించిన న్యూస్ రీడర్
  • పాకిస్థాన్‌లోని ఓ టీవీ చానెల్‌ స్టూడియోలో ఘటన

ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని లైవ్‌లో వార్తలు చదివిన ఘటన పాకిస్థాన్‌లోని సామా టీవీ స్టూడియోలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ బాలికపై దుండగులు అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని వీధుల్లో పడేశారు. అందుకు ఓ తల్లిగా నిరసన తెలుపుతూ న్యూన్ రీడర్ కిరణ్ నాజ్ లైవ్‌లో వార్తలు చదువుతూ బాలిక కిడ్నాప్ గురించి వివరించింది.

ఈ రోజు తాను ఓ న్యూస్ రీడర్‌గా రాలేదని, ఓ బిడ్డకు తల్లిగా వచ్చానని వ్యాఖ్యానించింది. బాలికపై ఇంతటి క్రూరంగా ప్రవర్తించడంతో మానవత్వానికి అంతిమ సంస్కారాలు జరిగాయని, ఇటువంటి కేసులను పోలీసులు ఎటువంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయాలని చెప్పింది.

More Telugu News