flipkart: మార్క్యూ పేరుతో స్మార్ట్‌టీవీ, ఏసీల‌ను ఆవిష్క‌రించిన ఫ్లిప్‌కార్ట్‌!

  • సీఈఎస్ 2018లో ఆవిష్క‌ర‌ణ‌
  • మే నెల‌లో విడుద‌ల‌కానున్న 32 ఇంచుల హెచ్‌డీఆర్ టీవీ
  • భార‌త ప్ర‌జ‌ల కోసం ప్ర‌త్యేకంగా డిజైన్‌

ఒక‌ప‌క్క ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అన్ని బ్రాండ్ల ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను అమ్ముతూనే, మ‌రోవైపు సొంతంగా ఓ ప్రైవేట్ లేబుల్ ద్వారా ఎల‌క్ట్రానిక్ వస్తువుల‌ను ఫ్లిప్‌కార్ట్ త‌యారుచేస్తోంది. మార్క్యూ అనే ఈ లేబుల్‌తో ఇప్ప‌టికే మైక్రోవేవ్ ఓవెన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్ల‌ను ఫ్లిప్‌కార్ట్ అమ్ముతోంది. తాజాగా ఇదే బ్రాండ్‌తో హెచ్‌డీఆర్ స్మార్ట్ టీవీ, ఏసీల‌ను అమ్మేందుకు ఫ్లిప్‌కార్ట్ రంగం సిద్ధం చేసింది.

ఈ మేర‌కు క‌న్జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షో 2018లో వీటిని ఆవిష్క‌రించింది. 32 ఇంచుల హెచ్‌డీఆర్ స్మార్ట్‌టీవీ మే నెల‌లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ హెడ్ ఆద‌ర్శ్ మీన‌న్ వెల్ల‌డించారు. అలాగే `ఇన్నోకూల్` రేంజ్‌తో 4 ర‌కాల వేరియంట్ల‌లో ఏసీల‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రత్యేకంగా భార‌త ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసమే ఈ ఉత్ప‌త్తుల‌ను డిజైన్ చేసిన‌ట్లు ఆద‌ర్శ్ మీన‌న్ పేర్కొన్నారు.

More Telugu News