AAnu Emmanuel: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అనూ ఇమ్మానుయేల్ కే ఛాన్స్!
  • ఈ 26న మంజుల 'మనసుకు నచ్చింది'
  • పూరీ 'మెహబూబా' షెడ్యూల్ పూర్తయింది 
  • బి.జయ దర్శకత్వంలో 'లక్కీ ఫెలో'  

*  రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ వచ్చే నెల 19 నుంచి జరుగుతుంది. అయితే, ఇందులో కథానాయిక ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ విషయంలో అనూ ఇమ్మానుయేల్, కైరా ఆద్వానీలతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో అనూ ఇమ్మానుయేల్ ఫైనల్ కావచ్చన్నది తాజా సమాచారం.    
*  మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే హైదరాబాదులో నిర్వహిస్తారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న 'మెహబూబా' చిత్రం హైదరాబాదు షెడ్యూలు పూర్తయింది. సుమారు నెల రోజుల పాటు ఈ షెడ్యూలు జరిగింది. దీంతో చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఆకాశ్ పూరీ, నేహా శెట్టి ఇందులో ఇందులో జంటగా నటిస్తున్నారు.
*  ఇటీవల 'వైశాఖం' చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు బి.జయ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి 'లక్కీ ఫెలో' అనే టైటిల్ని నిర్ణయించినట్టు దర్శకురాలు తెలిపారు. బి.ఏ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.        

More Telugu News