Cricket: క్రికెటర్ సురేశ్ రైనా ‘బితియా రాణి’ పాట

  • భార్య ప్రియాంక నిర్వహించే ఓ షో నిమిత్తం రైనా పాట
  • ‘రెడ్ ఎఫ్ఎం’ ద్వారా త్వరలో ప్రసారం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో

ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా ‘బితియా రాణి’ పాట పాడి తన అభిమానులను, ప్రేక్షకులను ఆనందపరిచాడు. తన భార్య ప్రియాంక నిర్వహించే ఓ షో నిమిత్తం ‘బితియా రాణి’ పాటను రైనా పాడాడు. ఈ పాట ‘రెడ్ ఎఫ్ఎం 93.5’ ద్వారా త్వరలో ప్రసారం కానుంది. అయితే, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ అయింది. సురేశ్ రైనాతో పాటు భార్య ప్రియాంక, వాళ్ల కూతురు చిన్నారి గ్రేసియా కూడా ఈ వీడియోలో కనబడతారు.


More Telugu News