padmavat: 'ప‌ద్మావ‌త్' చిత్రానికి 300ల క‌త్తిరింపుల వార్తల్లో వాస్తవం లేదు... సీబీఎఫ్‌సీ చైర్మ‌న్‌!

  • ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం చేసి సీబీఎఫ్‌సీ ప‌రువు తీయొద్దు
  • స‌ల‌హా క‌మిటీ మేర‌కు ఐదు చిన్న స‌వ‌ర‌ణ‌లు మాత్ర‌మే చేశాం
  • ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ప్ర‌సూన్ జోషీ

నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొని పేరులో చిన్న మార్పుతో ఎట్ట‌కేల‌కు విడుద‌లకాబోతున్న ప‌ద్మావ‌త్ చిత్రంలో సీబీఎఫ్‌సీ 300ల క‌త్తిరింపులు చేసిందంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను చైర్మ‌న్ ప్ర‌సూన్ జోషీ ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాజ్‌పుత్‌లు, చ‌రిత్ర‌కారుల స‌ల‌హా క‌మిటీ మేర‌కు తాము ఐదు చిన్న స‌వ‌ర‌ణ‌లు మాత్ర‌మే చేసిన‌ట్లు ప్ర‌సూన్ పేర్కొన్నారు. స‌మాజ మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకుని అవ‌స‌ర‌మైన విధంగా సినిమాను ఎడిట్ చేసిన‌ట్లు తెలిపారు.

మీడియాలో వ‌స్తున్న 300ల క‌త్తిరింపుల క‌థ‌నాలు అవాస్త‌వ‌మ‌ని ప్ర‌సూన్ జోషీ స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం చేసి సీబీఎఫ్‌సీ ప‌రువు తీయొద్ద‌ని ఆయ‌న కోరారు. జ‌న‌వ‌రి 25న ఈ చిత్రం విడుద‌లకానుంది. మ‌రోవైపు సినిమా విడుద‌ల‌ను ఎలాగైనా అడ్డుకుంటామ‌ని, పెట్రోలు పట్టుకుని మ‌రీ నిర‌స‌న‌లు, ఆందోళ‌నలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు క‌ర్నిసేన ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News