Hebba Patel: సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం!

  • రొమాంటిక్ లవ్ స్టోరీలో హెబ్బా పటేల్ 
  • దాసరికి బాలయ్య 'జైసింహా' అంకితం!
  • తెలుగులోకి జయం రవి 'టిక్ టిక్ టిక్'
  • సంక్రాంతికి అన్నపూర్ణా వారి 'రంగుల రాట్నం'

*  'ఏంజెల్' సినిమా తర్వాత కథానాయిక హెబ్బా పటేల్ తాజాగా మరో చిత్రానికి సంతకం చేసింది. ఎన్నో అవార్డులను అందుకున్న 'మిణుగురులు' చిత్రాన్ని రూపొందించిన అయోధ్య కుమార్ దర్శకత్వంలో రూపొందే రొమాంటిక్ లవ్ స్టోరీలో హెబ్బా నటిస్తుంది.
*  నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'జైసింహా' చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కల్యాణ్ చెబుతూ, ఈ చిత్రాన్ని తమ గురువు దివంగత దాసరి నారాయణరావుకి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.
*  తమిళంలో జయం రవి హీరోగా రూపొందుతున్న 'టిక్ టిక్ టిక్' చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో అనువదిస్తున్నారు. అంతరిక్షం కథాంశంతో శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది.    
*  రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. రంజని దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చిత్రశుక్లా కథానాయికగా నటించింది.  

More Telugu News