China: న‌లుగురి ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు!

  • చైనాలోని చాంగ్జౌ ప్రాంతంలో ఘటన
  • బస్సును ఢీకొన్న కారు
  • అదుపుతప్పి నదిలో పడ్డ బస్సు
  • వెంటనే స్పందించి క్రేన్‌ సాయంతో వారిని కాపాడిన వ్యక్తి

ఓ వ్యక్తి.. న‌దిలో ప‌డిన న‌లుగురిని కాపాడిన ఘ‌ట‌న చైనాలోని చాంగ్జౌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. ఆ వ్య‌క్తి చేసిన పరోపకారాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే ఆ ప్రాంతంలో ర‌హ‌దారిపై ఓ బ‌స్సు వెళుతోంది. అదే స‌మ‌యంలో ఓ కారు అదుపుత‌ప్పి ఎదురుగా దూసుకొచ్చి బ‌స్సు ఎడ‌మ బాగాన్ని ఢీ కొంది.

దీంతో ఆ బ‌స్సు కూడా అదుపు త‌ప్పి కుడివైపున ఉన్న ఓ న‌దిలో ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో ఆ బ‌స్సులో న‌లుగురు మాత్ర‌మే ఉన్నారు. అయితే, ఆ రోడ్డుప‌క్క‌కే ఉన్న ఓ క్రేన్ డ్రైవ‌ర్ ప‌రిగెత్తుకుంటూ వెళ్లి న‌దిలో ప‌డిపోయిన వారిని చూశాడు. త‌న క్రేన్ ను తీసుకొచ్చి దాని సాయంతో వారి ప్రాణాలు కాపాడాడు. మీరూ చూడండి...   

More Telugu News