India: నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా!

  • దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మొదటి టెస్టు
  • ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 81/4 (27 ఓవర్లకి)
  • భారత బౌలర్లలో షమీ, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 25.5 ఓవర్ల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. మొన్న రాత్రి మార్క్ రం 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ కాగా, ఎల్గర్ కూడా 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనే అవుటైన విషయం తెలిసిందే. నిన్న వర్షం కారణంగా ఆట కొనసాగలేదు. ఈ రోజు షమీ బౌలింగ్‌లో రబడా 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే వెనుదిరిగాడు. అనంతరం కొద్ది సేపటికే ఆమ్లా (4) కూడా షమీ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో డివిల్లియర్స్ 5, డెప్లెసిస్ 0 పరుగులతో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు 81/4(27 ఓవర్లకి) గా ఉంది. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా, టీమిండియా 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.    

More Telugu News