nagachaitanya: 'శైలజా రెడ్డి అల్లుడు' .. సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు

  • చైతూ హీరోగా షూటింగు దశలో 'సవ్యసాచి'
  • మారుతి దర్శకత్వంలో చేయనున్న 'శైలజా రెడ్డి అల్లుడు'
  • ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం నాగచైతన్య .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో ఆయనతో జోడీ కడుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చేస్తూనే మారుతితో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావడానికి నాగ చైతన్య ప్రయత్నిస్తున్నాడు. కథా పరంగా ఈ సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను అనుకున్నారు.

ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ రోజున ఈ సినిమా షూటింగును ప్రారంభించి .. నాన్ స్టాప్ గా 20 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. హీరో హీరోయిన్స్ మధ్యగల 'ఇగో' సమస్యలపై వినోదభరితంగా ఈ కథను మారుతి సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది.    

More Telugu News