Revanth Reddy: నా డాక్టరేట్ తప్పని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా : మంత్రి లక్ష్మారెడ్డి

  • ఆరోపణలు చేసేవారు జర్నలిస్టులను పంపించాలి
  • గుల్బర్గా యూనివర్శిటీకి తీసుకెళ్లేందుకు సిద్ధం
  • రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన మంత్రి

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసేవారు జర్నలిస్టులను పంపిస్తే, గుల్బర్గా యూనివర్శిటీకి తీసుకెళ్లేందుకు సిద్ధమని అన్నారు. తప్పని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్ లో నిజాలే పేర్కొన్నా, తప్పులుంటే ఎన్నికల సంఘం చూసుకుంటుందని అన్నారు.

కాగా, తెలంగాణ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్హ‌త‌ల‌పై కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ల‌క్ష్మారెడ్డి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, గుల్బ‌ర్గా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందానని ఓసారి, మరోసారి మరో చోట చదివానని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారని రేవంత్ విమర్శలు చేసిన నేపథ్యంలో లక్ష్మారెడ్డి పైవిధంగా వ్యాఖ్యానించారు.

More Telugu News