manchu vishnu: ''నేనేదనుకుంటే అది చెప్పడం నాకలవాటు'' అంటూ 'గాయత్రి' నుంచి కొత్త పోస్టర్

  • మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి'
  • కీలకమైన పాత్రల్లో విష్ణు - శ్రియ
  • ముఖ్య పాత్రలో నిఖిలా విమల్  
  • ఫిబ్రవరి 9వ తేదీన విడుదల    

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు 'గాయత్రి' సినిమాలో నటిస్తూ దానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ వదిలిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. గృహిణిగా .. అందంగా .. ఆకర్షణీయంగా ఈ పోస్టర్ లో శ్రియ కనిపిస్తోంది.

"నేనేదనుకుంటే అది చెప్పడం నా కలవాటు .. తరువాత సంగతి తరువాత" అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై కనిపిస్తూ, శ్రియ పాత్ర స్వభావాన్ని తెలుపుతోంది. స్థిరమైన ఆలోచనా విధానం .. ధైర్యంతో కూడుకున్న నిర్ణయం .. అవసరమైన తెగింపు ఈ పాత్ర స్వభావమని ఈ క్యాప్షన్ ను బట్టి అర్థమవుతోంది. విష్ణు భార్యగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. నిఖిలా విమల్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.    

More Telugu News