charan: చరణ్ .. బోయపాటి కాంబోపై రూమర్స్!

  • చరణ్ తాజా చిత్రంగా 'రంగస్థలం'
  • ఆ తరువాత సినిమా బోయపాటితో 
  • అది క్యాన్సిల్ అయిందంటూ పుకారు

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇక దీని తర్వాత చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయనున్నట్టు, ఆ సినిమా కథపై బోయపాటి కసరత్తు చేస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి.

హిందీలో వచ్చిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాకి ఇది రీమేక్ అనే ప్రచారం కూడా మొదలైంది. అయితే, ఈ ప్రచారాన్ని గురించి అటు చరణ్ గానీ .. ఇటు బోయపాటి టీమ్ గాని స్పందించలేదు. ఈ క్రమంలో అసలు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందనేది ఫిల్మ్ నగర్లో కొత్తగా హల్ చల్ చేస్తోన్న రూమర్. కారణమేమిటనేది తెలియడం లేదు గానీ, ప్రాజెక్టు మాత్రం అటకెక్కిందని అంటున్నారు. జోరుగా షికారు చేస్తోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది త్వరలోనే తెలుస్తుంది.    

More Telugu News