video conference: లాలూకి శిక్ష ఖ‌రారు తీర్పు రేపటికి వాయిదా!

  • రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వెల్ల‌డి
  • లాలూకు శిక్ష త‌గ్గించాలంటూ పిటిషన్
  • మీడియాకు తెలిపిన చిత్త‌రంజ‌న్ సిన్హా

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత‌ లాలూ ప్ర‌సాద్ స‌హా మిగ‌తా దోషులకు శిక్ష ఖరారు మ‌రోసారి వాయిదా ప‌డింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చిత్త‌రంజ‌న్ సిన్హా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఆయన జార్ఖండ్‌ రాంచీలోని సీబీఐ కోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణం కేసులో దోషుల‌కు రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌డ్జి శిక్ష ఖ‌రారు చేస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  

More Telugu News