south africa tour: భువనేశ్వర్ మార్క్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • ఓపెనర్లను పెవిలియన్ చేర్చిన భువనేశ్వర్
  • ఎల్గార్, మార్క్ రామ్ ఔట్
  • సఫారీలకు ఆదిలోనే ఎదురు దెబ్బ


భారత్ తో కేప్ టౌన్ లో ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ దెబ్బకు సౌతాఫ్రికా ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు.  2017లో అద్భుతమైన ఫామ్ ను కనబరిచిన ఎల్గార్ ను తొలి ఓవర్ మూడో బంతికి భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు ఎల్గార్. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ మార్క్ రామ్ కు ఆమ్లా జతకలిశాడు.

జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు, మరో ఓపెనర్ మార్క్ రామ్ (5)ను ఎల్బీడబ్లూ చేశాడు భువనేశ్వర్. ప్రస్తుతం ఆమ్లా (3), డీ విలియర్స్ (4) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు. 

More Telugu News