ipl: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌రకు విరాట్ కోహ్లీ!

  • రూ. 17 కోట్లకు తిరిగి సొంతం చేసుకున్న ఆర్‌సీబీ
  • రూ. 16 కోట్లతో రెండో స్థానంలో యువ‌రాజ్ సింగ్‌
  • రూ. 15 కోట్ల చొప్పున ధోనీ, రోహిత్ మూడో స్థానంలో 

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర పొందిన ఆట‌గాడిగా భార‌త జ‌ట్టు సార‌థి విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీని రూ. 17 కోట్ల‌కు రాయ‌ల్‌ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు తిరిగి సొంతం చేసుకుంది. నిజానికి కోహ్లీ ధ‌ర రూ. 15 కోట్లు ఉండ‌గా ఆర్‌సీబీ జ‌ట్టు మ‌రో రూ. 2 కోట్లు అద‌నంగా చెల్లించి మొత్తం రూ. 17 కోట్ల‌కు అత‌న్ని ద‌క్కించుకుంది. అలాగే విరాట్ త‌ర్వాతి స్థానంలో యువ‌రాజ్ సింగ్ నిలిచాడు. రూ. 16 కోట్ల‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్టు ఆయ‌న‌ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ (సీఎస్‌కే - రూ. 15 కోట్లు), రోహిత్ శ‌ర్మ (ముంబై ఇండియ‌న్స్ - రూ. 15 కోట్లు), ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్ (రూ.14.5కోట్లు), స్టీవ్‌ స్మిత్ (రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.12 కోట్లు), డేవిడ్‌ వార్నర్ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.12 కోట్లు) ఉన్నారు.

More Telugu News