lalu prasad yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కి కాసేపట్లో శిక్ష ఖరారు.. ఉత్కంఠ!

  • దాణా కుంభకోణం కేసులో ఇటీవలే తీర్పు
  • లాలూని దోషిగా ప్రకటించిన కోర్టు
  •  రాంచీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ

సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఇటీవ‌లే రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన  విష‌యం విదిత‌మే. ఈ కేసులో ఆయ‌నతో పాటు మ‌రో 15 మందిని కూడా దోషులుగా తేల్చింది. కేసులో తీర్పును వెల్ల‌డించినప్ప‌టి నుంచి లాలూ ప్ర‌సాద్‌ యాద‌వ్  బిర్సా మండా సెంట్ర‌ల్ జైలులో ఉంటున్నారు.

ఈయనకు కాసేప‌ట్లో రాంచీలోని సీబీఐ కోర్టు శిక్ష ఖ‌రారు చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో దోషి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పోలీసులు కోర్టు వ‌ద్ద‌కు తీసుకొచ్చారు. కాగా, దేవ్‌గ‌డ్ ఖ‌జానా నుంచి దాణా కొనుగోలు పేరిట లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ అక్ర‌మంగా నిధులు డ్రా చేశారనే విషయాన్ని ఇటీవ‌ల కోర్టు నిర్ధారించింది.

More Telugu News