ICC: టీ-20 ర్యాంకింగ్స్ లో ఇండియాకన్నా ముందున్న పాకిస్థాన్

  • తాజా ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ
  • తొలి స్థానంలో న్యూజిలాండ్
  • ఆ తరువాత పాకిస్థాన్, ఇండియా

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన తాజా టీ-20 ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలువగా, పాకిస్థాన్, భారత్ లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 126 పాయింట్లతో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, పాకిస్థాన్ (124), ఇండియా (121), ఇంగ్లండ్ (119), వెస్టిండీస్ (115) టాప్-5లో ఉన్నాయి. ఆ తరువాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, జింబాబ్వే, యూఏఈ, నెదర్లాండ్స్, హాంకాంగ్, పీఎన్జీ, ఒమన్, ఐర్లాండ్ దేశాలున్నాయని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

 పాకిస్థాన్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించడంతో ర్యాంకింగ్స్ మారిపోయాయని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఈ నెల 22, 25, 28న మూడు టీ-20 మ్యాచ్ లను ఆడనుండగా, ఈ మూడింటిలో కనీసం రెండింటిలో గెలిస్తే, టాప్ ప్లేస్ కు చేరుతుంది.

More Telugu News