flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 2018 మొబైల్ బొనాంజా సేల్‌... స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ ఆఫ‌ర్లు

  • రూ. 54,999కే ఆపిల్ ఐఫోన్ 8
  • రూ. 10,999కే రెడ్‌మీ నోట్ 4
  • జ‌న‌వ‌రి 5 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న సేల్‌

నూత‌న సంవత్స‌రం ప్రారంభంలోనే ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ ఓ స‌రికొత్త సేల్‌తో ముందుకొచ్చింది. '2018 మొబైల్ బొనాంజా' పేరుతో ఈ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ ఆఫర్ల‌ను ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 5 వ‌రకు జ‌ర‌గ‌నున్న ఈ సేల్‌లో శాంసంగ్‌, ఆపిల్‌, మోటోరోలా, షియోమీ, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ల‌పై కూడా డిస్కౌంట్లు అంద‌జేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల‌తో పాటు రూ. 99కే బై బ్యాక్ గ్యారంటీని ఇస్తుంది. దీంతో ఫోన్ తీసుకున్న సంవత్స‌రం లోపు కొన్న రేటులో 50 శాతానికి దాన్ని ఫ్లిప్‌కార్ట్‌కే అమ్ముకునే సదుపాయం క‌ల్పిస్తోంది.

ఇక ఆఫ‌ర్ల విష‌యానికి వ‌స్తే... రూ. 64,000లు గ‌ల ఆపిల్ ఐఫోన్ 8ను రూ. 54,999కి, రూ. 12,999 విలువ గ‌ల షియోమీ రెడ్‌మీ నోట్ 4ను రూ. 10,999కే ఫ్లిప్‌కార్ట్ అంద‌జేస్తోంది. అలాగే గూగుల్ పిక్సెల్‌2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ల‌పై కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ప్ర‌త్యేక డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అంద‌జేస్తోంది.

More Telugu News