Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే 
  • దూసుకుపోతున్న 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ 
  • రజనీకాంత్ బాటలో లారెన్స్!
  • సినిమా డైరెక్టర్ గా నారా రోహిత్!

*  ప్రస్తుతం 'సాక్ష్యం' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే త్వరలో మహేశ్ బాబు సరసన నటించనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించే చిత్రంలో పూజాను కథానాయికగా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.  
*  సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఎంతో క్రేజ్ వున్న విషయం మనకు తెలుసు. ఈ క్రమంలో బన్నీ తాజా చిత్రం 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ ఓ రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ లో విడుదలైన 29 గంటల్లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సాధించి ఆకట్టుకుంటోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.
*  తమిళనాట రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడంతో చాలా మంది ఆర్టిస్టులు ఆయనను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు లారెన్స్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెల 4న లారెన్స్ ప్రెస్ మీట్ పెట్టి తన రాజకీయ ప్రవేశ ప్రకటన చేయనున్నాడు.
*  నారా రోహిత్ తాజాగా పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటగాళ్లు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తను ఒక సినిమా డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

More Telugu News