new year: న్యూ ఇయ‌ర్ పార్టీకి రూ. 26 కోట్ల ఖ‌ర్చు... ఉద్యోగుల‌కు ఆనందాన్ని పంచిన సీఈఓ

  • గొప్ప పార్టీ ఇచ్చిన‌ స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పైగ‌ల్‌
  • లాస్ఏంజెల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేట‌ర్లో పార్టీ
  • హాజ‌రైన వివిధ దేశాల ఉద్యోగులు

ఉద్యోగుల‌ను ఆక‌ట్టుకోవాలంటే బోన‌స్‌లు మాత్ర‌మే ఇస్తే స‌రిపోదు. అప్పుడప్పుడు వారికి పార్టీలు, విందులు కూడా ఇవ్వాలి. ఈ విష‌యాన్ని స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పైగ‌ల్ గ్ర‌హించాడు. అందుకే వారి సంస్థ‌లో వివిధ దేశాల బ్రాంచుల్లో ప‌నిచేసే ఉద్యోగులంద‌రికీ క‌లిపి ఒకే చోట పెద్ద న్యూఇయ‌ర్ పార్టీ ఇచ్చాడు. ఇందుకోసం రూ. 26 కోట్లు ఖ‌ర్చు పెట్టాడు.

అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో మైక్రోసాఫ్ట్ థియేట‌ర్‌లో ఈ పార్టీ జ‌రిగింది. ప్ర‌పంచ‌వ్యాప్త వంట‌కాల‌తో పాటు గేమ్స్‌, అమెరిక‌న్ పాప్‌స్టార్ డ్రేక్‌తో క‌చేరీ కూడా ఈ పార్టీలో ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్నాప్‌చాట్ కార్యాల‌యాల్లో ప‌నిచేసే దాదాపు 5000ల మందికి పైగా ఉద్యోగులు ఈ పార్టీకి హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. పార్టీ ఖర్చు మొత్తం ఇవానే పెట్టుకున్నారు. ఆయన వార్షిక ఆదాయం 3.5 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.22 వేల కోట్లు.

More Telugu News