pavan: 'అజ్ఞాతవాసి' నైజామ్ హక్కులు ఒక రేంజ్ లో పలికాయట!

  • త్రివిక్రమ్ .. పవన్ క్రేజీ కాంబినేషన్ 
  • భారీ రేటు పలుకుతోన్న ఏరియా హక్కులు
  • కీలకమైన పాత్రలో ఖుష్బూ     

ఇప్పుడు ఎక్కడ చూసినా 'అజ్ఞాతవాసి' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా టీజర్ .. పవన్ పాడిన పాట అందరి దృష్టిని ఈ వైపు మళ్లించాయి. క్రేజీ కాంబినేషన్ కావడంతో అంతా ఈ సినిమాను గురించే చర్చించుకుంటున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ ఉండటంతో, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఈ సినిమా పట్ల డిమాండ్ పెరుగుతూ వెళుతోంది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజామ్ హక్కులు 27 కోట్లకు అమ్ముడైనట్టుగా సమాచారం. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా ఈ స్థాయి రేటును పలకడాన్ని గురించి విశేషంగా చెప్పుకుంటున్నారు. మిగతా ఏరియాలకి సంబంధించిన హక్కులు కూడా ఒక రేంజ్ లో పలికాయని అంటున్నారు. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, ఖుష్బూ ఒక కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.      

More Telugu News