vishnu: ఇద్దరిదీ ఒకటే ప్రాణం అంటూ 'గాయత్రి' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్

  • మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి'
  • కీలకమైన పాత్రల్లో విష్ణు - శ్రియ 
  • ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు

మోహన్ బాబు ప్రధానమైన పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విష్ణు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన శ్రియ కనిపించనుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విష్ణు - శ్రియలకి సంబంధించిన ఈ పోస్టర్ లో శ్రియకి 'జడ' అల్లుతూ విష్ణు కనిపిస్తున్నాడు.

 'ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం' అనే వాక్యంతో వదిలిన ఈ పోస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. యాక్షన్ .. ఎమోషన్స్ తో ఈ కథ కొనసాగనున్నట్టుగా పోస్టర్స్ ను బట్టి అర్థమవుతోంది. నిఖిలా విమల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు.     

More Telugu News