America: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఐదుగురు మృతి

  • ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన రెండు వేర్వేరు ఘటనలు
  • ఒక ఘటనలో దుండగుడిని హతమార్చిన పోలీసులు
  • మరో ఘటనలో తనను తాను కాల్చుకున్న సాయుధుడు 

అమెరికాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో జరిగిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు దిగాడు. పనిలో ఉన్న ఉద్యోగులు కాల్పుల శబ్దం విని పరుగులు తీశారు. కొందరు డెస్క్‌ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తర్వాత దుండగుడిని పోలీసులు హతమార్చారు.

హూస్టన్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ ఆటోషాప్‌లో గతంలో పనిచేసి  మానేసిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం షాపులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో షాపులో పలువురు ఉద్యోగులు, వినియోగదారులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపిన దుండగుడు బయటకు వచ్చి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

More Telugu News