murder: పాఠశాలలో టీచర్‌ గొంతుకోసి చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది

  • ప్రేమిస్తున్నాన‌ని ప‌్రవళిక అనే యువతిని వేధించిన యువ‌కుడు
  • ప‌్రవళికకు వివాహం నిశ్చ‌యం కావ‌డంతో దాడి
  • ఆపై పురుగుల మందు తాగిన వైనం
  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ద‌మ్మ‌పేట మండ‌లం నెమ‌లిపేట‌లో ఘటన

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ద‌మ్మ‌పేట మండ‌లం నెమ‌లిపేట‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ ప్రవళిక అనే యువతి వెంట పడుతోన్న శ్రీనివాసరాజు అనే ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. ప్రవళిక స్థానిక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ రోజు పాఠశాలకు వెళ్లిన ఆ యువకుడు.. ప్రవళిక మెడ కోసి, క‌త్తితో పొడిచి చంపేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇటీవలే ప‌్రవళికకు వివాహం నిశ్చ‌యం కావ‌డంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.           

More Telugu News